Jagan: జ‌గ‌న్ వైఖ‌రితో తీవ్ర మ‌నస్తాపానికి గుర‌య్యా: వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి

  • అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారుల‌తో ముగిసిన చ‌ర్చ‌
  • పాడేరు నుంచి విజ‌య‌వాడ బ‌య‌లుదేరిన గిడ్డి ఈశ్వ‌రి అనుచ‌రులు
  • రేపు విజ‌య‌వాడ‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తా-గిడ్డి ఈశ్వ‌రి

విశాఖ‌ప‌ట్నం జిల్లా పాడేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి రేపు తెలుగు దేశం పార్టీలో చేర‌నున్నారు. పాడేరులోని త‌న‌ క్యాంపు కార్యాల‌యంలో ఆమె త‌న‌ అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారులతో ఈ రోజు చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. రేపు తాను పాడేరు నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరుతున్న‌ట్లు ఆమె ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి వైఖ‌రితో తీవ్ర మ‌నస్తాపానికి గుర‌య్యాన‌ని ఈశ్వరి వ్యాఖ్యానించారు. అంతకు మించి మాట్లాడడానికి ఆమె నిరాకరించారు. రేపు విజ‌య‌వాడ‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. మ‌రోవైపు ఆమె అనుచ‌రులు పాడేరు నుంచి విజ‌య‌వాడకు బ‌య‌లుదేరుతున్నారు. 

  • Loading...

More Telugu News