geeta madhuri: అప్పుడు మాత్రం నేను చాలా బాధపడ్డాను: సింగర్ గీతామాధురి

  • నన్నూ .. నందూను ఓ టీవీ షోకి గెస్టులుగా పిలిచారు 
  • మేం వస్తే ఆ ప్రోగ్రాం చేయమని కొంతమంది సింగర్స్ చెప్పారట. 
  • నేను పాడిన చాలా పాటలను మరో సింగర్ తో పాడించిన సందర్భాలు వున్నాయి    

తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడిన గీతామాధురి .. తనని బాగా బాధపెట్టిన సంఘటనలలో ఒక దానిని గురించి ప్రస్తావించింది. "ఒక టీవీ ప్రోగ్రామ్ కి నేను .. నందూ గెస్టులుగా వెళ్లవలసి వుంది. అయితే మేం వస్తే ఆ ప్రోగ్రామ్ చేయమని కొంతమంది సింగర్స్ చెప్పారట. ఆ విషయం తరువాత మాకు తెలిసింది .. వాళ్ల పేరు చెప్పాలని లేదు. నేను ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోను. ఏ అవకాశంలో ఏముందోననే ఆలోచనతోనే వుంటాను. అవతల వాళ్లు ఎందుకలా ఫీలయ్యారు? .. ఎందుకలా చేశారు? .. నా అవకాశాన్ని ఎందుకు పోగొట్టారు? అని ఆ రోజంతా నేను బాగా బాధపడ్డాను".

 "ఆ సింగర్స్ ఆ తరువాత నాకు చాలాసార్లు కలిశారు. మొదట్లో ఎందుకలా చేశారు .. అని అనుకునేదాన్ని కానీ .. నాతో బాగానే వుంటున్నారు గదా అని ఆ విషయాన్ని గురించి ఆలోచించడం మానేశాను" అని చెప్పింది. ఇక మరో ప్రశ్నకి సమాధానమిస్తూ .. "నేను పాడిన పాటలను మళ్లీ వేరే సింగర్స్ తో పాడించిన సందర్భాలు .. అలాగే ముందుగా వేరే సింగర్ తో పాడించిన పాటలు ఆ తరువాత నాతో పాడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి" అని చెప్పుకొచ్చింది.   

  • Loading...

More Telugu News