kodnap: కారులో వ‌చ్చి.. బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న‌ యువ‌తిని అప‌హ‌రించిన దుండ‌గులు

  • అనంత‌పురం బ‌స్టాండ్ వ‌ద్ద క‌ల‌క‌లం
  • యువ‌తి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు
  • డిగ్రీ విద్యార్థిని అనూష కోసం పోలీసుల గాలింపు

అనంత‌పురం బ‌స్టాండ్ వ‌ద్ద క‌ల‌క‌లం ‌రేగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళుతోన్న ఓ యువ‌తి బ‌స్సు కోసం బ‌స్టాండు వ‌ద్ద నిల్చోగా కారులో వ‌చ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఆ విద్యార్థిని త‌ల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఆ యువ‌తి క‌దిరి మండ‌లం వీరేప‌ల్లికి చెందిన అనూషగా తెలిసింది. మాస్ట‌ర్ మైండ్స్ క‌ళాశాల‌లో ఆమె డిగ్రీ చదువుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. సీసీ కెమెరాల్లో ఆధారాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. 

  • Loading...

More Telugu News