murder: స్నేహితుడి తలను నరికి.. కాలువ పక్కన పాతిపెట్టిన యువ‌కులు!

  • తమిళనాడులోని నాగైలో ఘటన
  • న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గత నెల 31న పార్టీ చేసుకున్న స్నేహితులు
  • తనను పిలవలేదని గొడవపడ్డ ఓ యువకుడు
  • ఐదుగురు యువకులు కలిసి హత్య చేసిన వైనం

ఐదుగురు యువ‌కులు మ‌రో యువ‌కుడితో గొడ‌వ‌ప‌డి హ‌త్య చేసిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని నాగైలో భారతి మార్కెట్‌ ప్రాంతంలో నివ‌సించే మ‌దియళగన్‌, సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ ఆడుతూపాడుతూ తిరిగేవారు. అప్పుడ‌ప్పుడు అంతాక‌లిసి మందు పార్టీ చేసుకునేవారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గత నెల 31న రాత్రి స్థానిక‌ శ్మశానవాటిక ప్రాంతంలో సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ మందు పార్టీ చేసుకున్నారు. త‌న‌కు క‌బురు పంప‌కుండానే త‌న మిత్రులు మందు పార్టీ చేసుకుంటుండ‌డంతో మదియళగన్ అక్క‌డ‌కు వెళ్లి వారిని నిల‌దీశాడు.

దీంతో చెల‌రేగిన గొడ‌వ‌లో మ‌దియళగన్‌ బీర్‌ బాటిల్‌ తీసుకుని ఓ స్నేహితుడిని పొడవ‌డానికి య‌త్నించ‌గా మిగ‌తా స్నేహితులంతా క‌లిసి క‌త్తితో మదియళగన్‌ను పొడిచి చంపేశారు. అంతేకాదు, మదియళగన్‌ తలను శరీరం నుంచి వేరు చేశారు. అనంత‌రం తలని, మొండాన్ని ఓ కాలువ పక్కన గుంత తవ్వి పాతిపెట్టారు. త‌మ కుమారుడు క‌న‌ప‌డ‌కపోవ‌డంతో అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు మదియళగన్ స్నేహితులే అత‌డిని చంపేశార‌ని గుర్తించారు. ముదియ‌ళ‌గ‌న్ స్నేహితులు నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు మాత్రం ప‌రారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News