tgv: పవన్ కల్యాణ్ చెబితే వినడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా?: టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్

  • బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం 
  • ఎల్లుండి పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ
  • జనసేనతో కలిసి పని చేసే అంశం చంద్రబాబు, పవన్ తీసుకునే నిర్ణయంతో ముడిపడి ఉంటుంది
  • -టీజీ వెంకటేశ్

భారతీయ జనతా పార్టీతో దోస్తీ వదులుకుని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలుస్తామా? లేదా? అన్న విషయం గురించి ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. టీడీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని, ఆ మేరకే రాజీనామా చేయనున్నారా? అని అడగగా, టీజీవీ సమాధానం ఇస్తూ, 'పవన్ చెబితే వినడానికి మేమేమన్నా చిన్నపిల్లలమా?' అని చురకలంటించారు. బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారని, ఎల్లుండి సాయంత్రం చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు,.

  • Loading...

More Telugu News