komati reddy venkatreddy: కేసీఆర్ పై దొంగనోట్లు, దొంగ పాస్ పోర్టు కేసులున్నాయ్.. కేటీఆర్ ఓ బ్రోకర్: కోమటిరెడ్డి ఫైర్

  • బ్లాక్ టికెట్లను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్ ది
  • తండ్రి, కొడుకు, కూతురు కలసి 10 వేల కోట్లు దోచుకున్నారు
  • కేసీఆర్, కేటీఆర్ లు జైలుకెళ్లడం ఖాయం

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లు దోపిడీ దొంగలంటూ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వీరిద్దరికీ అధికారం పోతుందనే భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రూ. 10 వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ, పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి, 10 శాతం కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు. రూ. 500 కోట్లతో  పూర్తయ్యే ఫైబర్ కేబుల్ వైరుకు కేటీఆర్ బావమరిది పేరుతో కాంట్రాక్టు ఇప్పించి, రూ. 5 వేల కోట్లను దోచుకున్నారని అన్నారు.

మియాపూర్, జీడిమెట్ల భూకుంభకోణాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా బయటపెడతామని కోమటిరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే... కేసీఆర్, కేటీఆర్ లు జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. మోదీ, రాహుల్ గాంధీలను కేసీఆర్ నోటికొచ్చినట్టు దూషిస్తుంటే... జానారెడ్డిని కేటీఆర్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ పై గతంలో నకిలీ నోట్ల కేసు, దొంగ పాస్ పోర్టుల కేసులున్నాయని... బ్లాక్ టికెట్లను అమ్ముకున్న చరిత్ర ఆయనదని కోమటిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి ఆస్తులపై విచారణ జరిపించి, ఈడీ కేసులను పెడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News