aaraku: నేను ఇప్పుడు ఏ రాజకీయపార్టీలో లేను: ఎంపీ కొత్తపల్లి గీత

  • ‘రాష్ట్ర విభజన వల్ల సామాన్యులకు ఎటువంటి నష్టం లేదు
  • పరిపాలనా సౌలభ్యం కోసమే ‘ప్యాకేజ్’ 
  • పబ్బం గడుపుకోవాలని రాజకీయపార్టీలు చూస్తున్నాయి : గీత

తాను ఇప్పుడు ఏ రాజకీయపార్టీలోలేనని, ఏ రాజకీయ పార్టీ లబ్ధి కోసం తాను పనిచేయడం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ‘ఎన్టీవీ’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘రాష్ట్ర విభజన వల్ల సామాన్య ప్రజలకు ఈరోజు ఎటువంటి నష్టం లేదు. ప్రత్యేక ప్యాకేజ్ రాకపోయినా నష్టంలేదు. ప్యాకేజ్ అనేది పరిపాలనా సౌలభ్యం కోసం తప్పితే, సామాన్య ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని రాజకీయపార్టీలు చూస్తున్నాయి. అయితే, ప్రజలేమీ అమాయకులు కాదు వాళ్లు ఆలోచిస్తారు’ అని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి నమ్మకం తగ్గిపోయింది. దీనికి కారణం కూడా నేను చెబుతాను. కేంద్రం నుంచి తీసుకున్న డబ్బులకు లెక్కలు చెప్పట్లేదు. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అనుమానాలు వస్తున్నాయి.’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా గీత చెప్పారు.

  • Loading...

More Telugu News