No confidence Motion: చకచకా దూసుకెళుతున్న టీడీపీ... లోక్ సభ కార్యదర్శికి సొంతంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీలు

  • నోటీసుపై 16 మంది సంతకాలు చేశారు
  • ఏపీ ప్రభుత్వంపై బీజేపీ కక్ష సాధింపు
  • ఇతర పార్టీల మద్దతు తీసుకొస్తాం

ఈ ఉదయం చంద్రబాబునాయుడు ఆదేశించినట్టుగానే 16 మంది తెలుగుదేశం సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసును టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం లోక్ సభ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితం అందించారు. నోటీసులను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆపై మీడియాతో మాట్లాడిన తోట నరసింహం, ఆంధ్రప్రదేశ్ పై, తెలుగుదేశం పార్టీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. తమ అధినేత అవిశ్వాసంపై ఇతర పార్టీల మద్దతు కోసం చర్చిస్తున్నారని తోట నరసింహం వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News