Karnataka: రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఆర్‌ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక వాయిదా

  • ఆర్‌ఆర్‌ నగర్‌లో ఇటీవల 9746 ఓటరు కార్డులు లభ్యం
  • ఆ స్థానానికి 28న ఎన్నిక
  • 31న ఫలితం వెల్లడి

రేపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్‌ (ఆర్‌ఆర్‌ నగర్‌) అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది. ఆ ఎన్నిక ఫలితం ఈ నెల 31న వెలువడుతుంది. ఇటీవల ఆ నియోజకవర్గంలోని ఓ ఫ్లాట్‌లో 9746 ఓటరు కార్డులతో పాటు పోలింగ్‌లో ఉపయోగించే కొన్ని వస్తువులను అధికారులు సీజ్‌ చేశారు. ఈ క్రమంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, బీజేపీ అభ్యర్థి మృతితో ఇప్పటికే జయనగర్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ వాయిదా పడింది. దీంతో కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 222 స్థానాలకి మాత్రమే రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 15న వెల్లడిస్తారు.

  • Loading...

More Telugu News