Telangana: నన్ను బహిష్కరించే హక్కు వాళ్లకెక్కడిది?: మోత్కుపల్లి

  • పార్టీ నుంచి బహిష్కరించడంపై స్పందించిన మోత్కుపల్లి
  • టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారు
  • ఆ జెండా నందమూరి వారిది

టీడీపీ అధినేత చంద్రబాబుపైన, ఆ పార్టీ తీరుతెన్నులపైన విమర్శలు గుప్పించిన టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి స్పందిస్తూ, తనను బహిష్కరించే హక్కు వారికెక్కడదని ప్రశ్నించారు. టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని, ఆ జెండా నందమూరి వారిదని అన్నారు. కాగా, మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడు వేదికగా రమణ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News