rajani: కార్తీక్ సుబ్బరాజు మూవీ కోసం హిమాలయాలకి రజనీ

  • కార్తీక్ సుబ్బరాజ్ తో రజనీ 
  • ఆయన సరసన కథానాయికగా సిమ్రాన్ 
  • ముఖ్యమైన పాత్రలో విజయ్ సేతుపతి    

ఒక వైపున రజనీ .. శంకర్ కాంబినేషన్లోని 'రోబో 2.ఓ' సినిమా విడుదలకి ముస్తాబవుతూ వుంటే, మరో వైపున 'కాలా' విడుదల తేదీని ఖరారు చేసుకుని ఆ తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో రజనీ కథానాయకుడిగా మరో భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నాడు.

వచ్చేనెల మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ ను హిమాలయాల్లో ప్లాన్ చేశారు. రజనీ తదితరులపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సిమ్రన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు.  

  • Loading...

More Telugu News