Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మైసూర్ లో 'క్వీన్' షూటింగ్
  • ఏఎన్నార్ బయోపిక్ లేదన్న నాగార్జున 
  • డెహ్రాడూన్ వెళుతున్న మహేశ్

*  హిందీలో వచ్చిన 'క్వీన్' చిత్రాన్ని తమన్నా ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ చిత్రానికి 'అ' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. నిన్నటి నుంచి ఈ చిత్రం షూటింగును మైసూర్ లో నిర్వహిస్తున్నారు.
*  సావిత్రి బయోపిక్ 'మహానటి' ఘన విజయం సాధించడంతో పలువురి జీవితాలపై బయోపిక్ ల నిర్మాణం టాలీవుడ్ లో జోరందుకుంది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ ను కూడా నిర్మిస్తారంటూ వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని, అలాంటి ఉద్దేశమే తమకు లేదని అక్కినేని నాగార్జున తెలిపారు.
*  'భరత్ అనే నేను' చిత్రం హిట్ తర్వాత మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ త్వరలో డెహ్రాడూన్ లో మొదలవుతుందని సమాచారం. ఇందులో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

  • Loading...

More Telugu News