Andhra Pradesh: మూడో రోజు టెట్ కు 47,276 మంది అభ్య‌ర్థుల‌ హాజరు: ఏపీ టెట్ క‌న్వీన‌ర్

  • పేప‌ర్ 1 ఎస్టీటీ తెలుగుకి సంబంధించి ప‌రీక్ష
  • మొత్తం 99 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష
  • మార్కుల వివ‌రాలు రేపు అభ్య‌ర్థుల మొబైళ్ల‌కు..
  • టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులకు సూచనలు

మూడో రోజు అన్ని ప‌రీక్షా కేంద్రాల్లో ఏపీ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) ప్ర‌శాంతంగా జ‌రిగింది. అభ్య‌ర్థుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా మూడో రోజు టెట్  ముగిసిందని, మొత్తం 47,276 మంది ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని టెట్ క‌న్వీన‌ర్ ఏ.సుబ్బారెడ్డి ఈరోజు విడుద‌ల చేసిన పత్రికా ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు. పేప‌ర్ 1 ఎస్టీటీ తెలుగుకి సంబంధించి ప‌రీక్ష నిర్వ‌హించామ‌ని, ఈ ప‌రీక్ష‌కు 49,380 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారని అన్నారు.

ఈ రోజు మొత్తం 95.74 శాతం మంది టెట్ కు హాజ‌ర‌య్యార‌ని చెప్పారు. మొత్తం 99 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించామ‌న్నారు. టెట్ ప‌రీక్ష ముగిసిన వెంట‌నే బ‌ట‌న్ నొక్క‌గానే అభ్య‌ర్థుల‌కు త‌మ‌త‌మ మార్కులు స్క్రీన్ పై క‌నిపించాయి. ఈ మార్కుల వివ‌రాల‌ను రేపు అభ్య‌ర్థుల మొబైళ్ల‌కు పంపిస్తామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు.

టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులకు సూచనలు..

టెట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా క్రీడ‌ల్లో తాము సాధించిన ప్ర‌తిభా ప‌త్రాల‌ను టెట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని, వీటికి సంబంధించి అనుబంధ ఫార్మాట్ లు వెబ్ సైట్ లో ఉంచామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు. అనుబంధ ప‌త్రం 1, 2, 3 లుగా ఉంచామ‌ని ఒక్కో ప‌త్రానికి 30 ఇన్సెంటివ్ మార్కులు, రెండో ఫార్మాట్ కు 25, మూడో ఫార్మాట్ కు 20 మార్కులు ఉంటాయ‌న్నారు. వీటిని సంబంధిత ఫెడ‌రేష‌న్లు, యూనివ‌ర్సిటీలు, స్కూల్ గేమ్స్ ఫెడ‌రేష‌న్ల వ‌ద్ద ధ్రువీక‌ర‌ణ చేయించుకొని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న వివరించారు.

  • Loading...

More Telugu News