Chandrababu: నాకు మోకాళ్ల నొప్పి.. అయినా తిరుమల మెట్లెక్కి చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుంటా: మోత్కుపల్లి

  • ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదే
  • టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలి
  • లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై  టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నానని, అయినప్పటికీ తిరుమల మెట్లెక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని అన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని, టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని, లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారని మండిపడ్డారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి దొరికిపోయారని, వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. జగన్ తో తాను కుమ్మక్యయ్యానని తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించమని తానే స్వయంగా చెబుతున్నానని అన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి తాను పోటీ చేస్తానని, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి తనకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది చంద్రబాబు కాదని, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ అని మోత్కుపల్లి అన్నారు.

  • Loading...

More Telugu News