Tamilnadu: తమిళనాడు సీఎం పళనిస్వామిని కలిసిన స్టాలిన్!

  • కరుణ ఆరోగ్యం గురించి పళనికి వివరించిన స్టాలిన్
  • పోలీస్ అధికారులందరూ చెన్నైకి రావాలని ఆదేశాలు
  • ఢిల్లీలోని డీఎంకే ఎంపీలకూ సమాచారం

తమిళనాడు సీఎం పళనిస్వామిని డీఎంకే నేత స్టాలిన్ కొద్ది సేపటి క్రితం కలిశారు. డీఎంకే అధినేత, తన తండ్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి పళనిస్వామికి స్టాలిన్ వివరించినట్టు సమాచారం. కాగా, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉంది. కరుణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ కొంచెం సేపట్లో విడుదల కానుంది.

ఇదిలా ఉండగా, కావేరి ఆసుపత్రి వద్దకు కరుణానిధి అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరోపక్క, పోలీస్ అధికారులందరూ చెన్నైకి రావాల్సిందిగా తమిళనాడు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉన్న డీఎంకే ఎంపీలు, కీలక నేతలను చెన్నైకి రావాల్సిందిగా అన్నా అరివాలయం (డీఎంకే కేంద్ర కార్యాలయం) ఆదేశాలు పంపింది.

  • Loading...

More Telugu News