kodela: కోడెల శివప్రసాద్ ఓ ఫ్యాక్షనిస్టు: ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • కేసు నుంచి బయటపడి స్పీకర్ అయ్యారు
  • చంద్రబాబు అక్రమాస్తులు కూడ బెట్టారు
  • అవినీతి మరకను తుడుచుకోవాలని చూస్తున్నారు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోడెల ఓ ఫ్యాక్షనిస్టని, కేసు నుంచి బయటపడి స్పీకర్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వంపైనా ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబుు మూడు లక్షల కోట్ల అక్రమాస్తులు కూడ బెట్టారని, బీజేపీని అంటరాని పార్టీగా చేసి తమపై ఉన్న అవినీతి మరకను తుడుచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News