smt organisation: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు.. స్టెంట్ ల తయారీ యూనిట్

  • మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎస్ఎంటీ కంపెనీ బృందం
  • రూ.250 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాంట్ 
  • ఈ ప్లాంట్ ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు వచ్చింది. గుండె సంబంధిత స్టెంట్ ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎస్ఎంటీ కంపెనీ బృందం మంత్రి కేటీఆర్ ను ఈరోజు హైదరాబాదులో కలిసింది. రూ.250 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్ పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ లో ఎస్ఎంటీ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది.

తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతుల వల్లే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నామని ఎస్ఎంటీ ప్రతినిధులు చెప్పారు. కాగా, తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్లాంట్ రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ఈ ప్లాంట్ రావడం ద్వారా కొత్తగా రెండు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు. 

  • Loading...

More Telugu News