keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చైనా నటుడి సరసన కీర్తి సురేశ్ 
  • 'ఎన్టీఆర్'లో సీనియర్ నటుడు పృధ్వీ 
  • 'చిత్రలహరి'కి రెడీ అవుతున్న మెగా హీరో 

*  అందాలతార కీర్తి సురేశ్ తాజాగా ఓ చైనీస్ యాక్టర్ సరసన నటించనుంది. మోహన్ లాల్ హీరోగా 'మరక్కర్: అరబికడలనైట్ సింహం' పేరిట మలయాళంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ చైనా నటుడికి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తుందట.  
*  నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ గా 'ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలకు ఎంపికయ్యారు. తాజాగా సీనియర్ రాజకీయ నాయకుడు జైపాల్ రెడ్డి పాత్రకు గాను సీనియర్ నటుడు పృధ్వీని తీసుకున్నారట.  
*  కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరం తేజ్ హీరోగా 'చిత్రలహరి' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల మూడో వారం నుంచి జరుగుతుంది. ఇందులో సాయి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు.

  • Loading...

More Telugu News