mavoists: మావోయిస్టులు-పోలీసులకు మధ్య కాల్పులు.. తప్పించుకున్న ఆర్కే!

  • పొట్టంగి-సుంగి మధ్య ఎదురు కాల్పులు
  • తప్పించుకున్న అగ్రనేతలు
  • కొనసాగుతున్న కాల్పులు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, చలపతి, అరుణ తప్పించుకున్నట్టు సమాచారం. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పొట్టంగి-సుంగి మధ్య మావోయిస్టులు - బీఎస్ఎఫ్, ఎస్ఓజీ పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకూ ఎవరూ మృతి చెందలేదని కోరాపుట్ ఎస్పీ తన్వల్ విశాల్ సింగ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం బీఎస్ఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News