raviteja: రవితేజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు

  • రవితేజ సరసన ఇలియానా 
  • ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 16వ తేదీన సినిమా విడుదల   

రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' నిర్మితమైంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు ముందుగానే చెప్పారు. తాజాగా ఈ వేడుక జరిగే వేదిక ఖరారు అయింది.

హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్లో రేపు సాయంత్రం 6:30 గంటలకు ఈ వేడుక మొదలుకానుంది. ముఖ్య అతిథులు ఎవరనేది ఇంకా ఎనౌన్స్ చేయవలసి వుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాలో కథానాయికగా ఇలియానా అలరించనుంది. కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలాపడిన శ్రీను వైట్ల, ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను అందిస్తుందనే నమ్మకంతో వున్నాడు.    

  • Loading...

More Telugu News