TRS: హైదరాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభకు అనుమతి నిరాకరణ

  • డిసెంబర్ 3న పరేడ్ గ్రౌండ్ లో సభను నిర్వహించాలనుకున్న టీఆర్ఎస్
  • నేవీ కార్యక్రమాలు జరుగుతుండటంతో అనుమతి నిరాకరణ
  • ప్రత్యామ్నాయ వేదిక కోసం అన్వేషిస్తున్న నేతలు

హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి లభించలేదు. డిసెంబర్ 3వ తేదీన ఈ సభను నిర్వహించనున్నారు. సభకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో నేవీ కార్యక్రమాలు ఉండటంతో టీఆర్ఎస్ వినతిని అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్నాయ వేదిక కోసం టీఆర్ఎస్ శ్రేణులు అన్వేషిస్తున్నాయి. రాష్ట్ర రాజధానిలో నిర్వహించనున్న ఈ సభను భారీ ఎత్తున జరపాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News