balakrishna: 'కథానాయకుడు' కోసం డబ్బింగ్ చెప్పిన నిత్యామీనన్

  • 'కథానాయకుడు' షూటింగు పూర్తి 
  • వేగంగా జరుగుతోన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
  • జనవరి 9వ తేదీన భారీ విడుదల     

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించిన విశేషాలతో 'కథానాయకుడు' .. రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన విషయాలతో 'మహానాయకుడు' నిర్మితమవుతున్నాయి. రీసెంట్ గా 'కథానాయకుడు' సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఈ సినిమాలో సావిత్రి పాత్రను నిత్యామీనన్ పోషించింది. ఎన్టీఆర్ .. సావిత్రి కాంబినేషన్లో రూపొందిన 'మిస్సమ్మ' .. 'గుండమ్మ కథ'.. 'మాయా బజార్' సినిమాల్లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల్ని బయోపిక్ కోసం చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్లో తన పాత్రకి నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పింది. సావిత్రిగా నిత్యామీనన్ పోస్టర్ బయటికి వచ్చినప్పుడే ఆమె ఈ పాత్రకి చక్కగా కుదిరిందనే టాక్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.     

  • Loading...

More Telugu News