budda venkanna: ముఖ్యమంత్రి కుర్చీ కోసమే జగన్‌ సంబరాలు: బుద్ధా వెంకన్న

  • టీఆర్‌ఎస్‌ గెలిస్తే వైసీపీకి ఎందుకు ఆనందం
  • విజయసాయిరెడ్డి చీర్‌గాల్స్‌లా చిందులు వేస్తున్నారు
  • నాడు వైఎస్సార్‌ను కేసీఆర్‌ తిట్టిన విషయం మర్చిపోయినట్టున్నారు

ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అందుకోసం అన్ని నీతినియమాలను పక్కన పెట్టేశారని, లేదంటే తెలంగాణలో కేసీఆర్‌ గెలిస్తే ఇక్కడ వైసీపీకి ఎందుకు ఆనందం? అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఆనాడు వైఎస్సార్‌ను నోటికొచ్చినట్టు తిట్టిన కేసీఆర్‌ ఇప్పుడు జగన్‌కు దేవుడిలా కనిపించడం విడ్డూరంగా ఉందన్నారు.

మరో వైపు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చీర్‌గర్ల్స్‌లా డ్యాన్స్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జెండా పూర్తిగా పీకేసిన వైసీపీనా చంద్రబాబును విమర్శించేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ బీజేపీ మాయలో పడి ఏపీకి వచ్చి ప్రచారం చేస్తానని చెబుతున్నారని, ఒవైసీతోపాటు కేసీఆర్‌ వచ్చి ప్రచారం చేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News