Telangana: ఉమ్మడి హైకోర్టు విభజన.. ఆయా హైకోర్టులకు కేటాయించిన న్యాయమూర్తుల వివరాలు!

  • తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులు
  • ఏపీకి 16 మంది న్యాయమూర్తులు
  • ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన న్యాయమూర్తుల వివరాలు..

తెలంగాణ హైకోర్టుకు.. 
జస్టిస్ పులిగూర వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ ఎం. సత్య రత్న శ్రీ రామచంద్రరావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ చౌదరి, జస్టిస్ బులుసు శివ శంకరరావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు, జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ తొడుపునూరి అమరనాథ్ గౌడ్

ఏపీ హైకోర్టుకు ..  జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సీహెచ్. ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ టి. సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ జి.శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కుమారి జే. ఉమా దేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ టి. రజనీ, జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్  కొంగర విజయ లక్ష్మీ, జస్టిస్ గంగారావు 

  • Loading...

More Telugu News