High Court: రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి డిమాండ్

  • అమరావతికి తరలింపు దారుణం
  • సీమ ప్రజల అవకాశాన్ని దెబ్బతీశారు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి

రాయల సీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఈ నిర్ణయంతో సీమ ప్రజలకు రావాల్సిన అవకాశాన్ని దెబ్బకొట్టారని మండిపడ్డారు. రాజధానిగా అమరావతికి ఇప్పటికే ఎన్నో సదుపాయాలు కేటాయించినందున హైకోర్టునైనా రాయలసీమకు ఇవ్వాల్సిందన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News