Kerala: శబరిమలకు వెళ్లినందుకు దుర్గపై అత్త దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు!

  • కేరళలోని తిరువనంతపురంలో ఘటన
  • అజ్ఞాతం నుంచి ఇంటికి వచ్చిన దుర్గ
  • గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన మహిళ

శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చిన కనకదుర్గపై ఈరోజు అత్త దాడిచేసిన సంగతి తెలిసిందే. హిందూ సంఘాల హెచ్చరికలతో 2 వారాల పాటు అజ్ఞాతంలో గడిపిన కనకదుర్గ తిరువనంతపురంలో ఉన్న తన ఇంటికి తెల్లవారుజామున చేరుకోగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కనకదుర్గను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

తాజాగా కోడలిపై దాడి చేసినందుకు సదరు అత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కనకదుర్గపై దాడి ఘటన మీడియాలో వైరల్ గా మారడంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 2న కనకదుర్గ, బిందు అనే మరో మహిళతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని 2018, సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News