Telangana: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది: అజారుద్దీన్

  • కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొస్తుంది
  • ఇచ్చిన హామీలను మోదీ పట్టించుకోలేదు
  • యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే అధిష్ఠానం చూసుకుంటుంది

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో మోదీ చేసిన అభివృద్ధి కంటే రాహుల్ ఫ్యామిలీపై విమర్శలకే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు.

ఇచ్చిన హామీలను మోదీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా అంబర్ పేటలోని ఓ మసీదును జీహెచ్ఎంసీ కూల్చివేసిన ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News