Nagashaurya: దూకుడు మీదే వున్న నాగశౌర్య

  • 'నర్తనశాల'తో పరాజయం
  • సొంత బ్యానర్లో మరో సినిమా 
  • కొత్తదనంపై ప్రత్యేక దృష్టి

'నర్తనశాల' పరాజయంపాలు కావడంతో, కథల ఎంపిక విషయంలో నాగశౌర్య మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కథలన్నింటిని ఒక కొలిక్కి తీసుకొచ్చి రంగంలోకి దిగేశాడు. ముందుగా సొంత బ్యానర్లో నిర్మిస్తోన్న సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు.

మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ ను అన్బు - అరివు డిజైన్ చేశారు. 'కేజీఎఫ్' సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన ఈ ఇద్దరూ పనిచేస్తోన్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ ఇద్దరూ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ ను ఇటీవలే వైజాగ్ లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను అక్టోబర్లో మొదలెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పోసాని ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. 

  • Loading...

More Telugu News