TS RTC: తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టు స్టే

  • 5,100 బస్సులు ప్రవేటు రూట్లలో నడపాలన్న నిర్ణయంపై కోర్టు ఆక్షేపణ
  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
  • కేబినెట్ తీసుకున్న నిర్ణయం కోర్టుకు తెలపాలని ఆదేశం

తెలంగాణలో 5,100 బస్సులను ప్రైవేటు రూట్లలో నడపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఆ నిర్ణయంపై స్టే విధించింది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.  ఆర్టీసీ రూట్ల  ప్రైవేటీకరణను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ వాదన పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News