New Delhi: ప్రాణాలు తీసిన పొగమంచు.. అదుపుతప్పి కాల్వలోకి కారు.. ఆరుగురి మృతి

  • గ్రేటర్ నోయిడాలో ఘటన
  • పొగమంచు కారణంగా కనిపించని దారి
  • మృతుల్లో ఇద్దరు మైనర్లు

పొగమంచు ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. దట్టంగా కమ్ముకున్న మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో అదుపు తప్పిన ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గ్రేటర్ నోయిడాలో జరిగిందీ ఘటన.

సంబల్ జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ కారు గ్రేటర్ నోయిడా వద్ద అదుపు తప్పి ఓ కాల్వలోకి దూసుకెళ్లింది. మంచు కారణంగా ముందున్న దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లించారు. ఉత్తర రైల్వే పరిధిలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News