paritala sunita: 'సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్' ముగ్గులు వేసిన పరిటాల సునీత.. ఫొటోలు ఇవిగో

  • వెంకటాపురంలో తన నివాసం ముందు ముగ్గులు
  • అమరావతి పరిరక్షణ సమితికి మద్దతు
  • అమరావతి రైతులకు, మహిళలకు సంఘీభావం

అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురంలో తన నివాసం ముందు మాజీ మంత్రి పరిటాల సునీత 'సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్' అని ముగ్గులు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి(జేఏసీ) పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె ఇలా రైతులకు మద్దతు తెలుపుతూ ముగ్గులు వేశారు.  
            
 ఈ విషయాన్ని తెలుపుతూ పరిటాల శ్రీరామ్ ట్వీట్ చేశారు. 'రాప్తాడు నియోజకవర్గంలోని వెంకటాపురంలో తమ ఇంటి ముందు, 'సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్' అని ముగ్గులు వేసి  అమరావతి రైతులకు, మహిళలకు సంఘీభావం ప్రకటించిన పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ ఇతర కుటుంబసభ్యులు' అని ఆయన పేర్కొన్నారు.      

  • Loading...

More Telugu News