Allu Arjun: 6 రోజుల్లోనే 104 కోట్ల షేర్ రాబట్టిన 'అల వైకుంఠపురములో'

  • భారీ ఓపెనింగ్స్ తో మొదలైన బన్నీ మూవీ 
  •  తెలుగు రాష్ట్రాల్లో 82 కోట్ల షేర్ 
  •  కర్ణాటకలోను బన్నీ దూకుడు  

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అల వైకుంఠపురములో' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో 'టబు' కనిపించింది. భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లోనే ఈ సినిమా 82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. కర్ణాటకలో ఈ సినిమా ఈ 6 రోజుల్లో 8.5 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 104 కోట్ల షేర్ ను సాధించింది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును సృష్టించిందంటూ అధికారికంగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ ఏడాది ఆరంభంలోనే బన్నీకి భారీ సక్సెస్ లభించినందుకు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News