Buddha Venkanna: రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోచిన జగన్ గారూ, ఐటీ దాడుల గురించి మీరు మాట్లాడడం హాస్యాస్పదం: బుద్ధా వెంకన్న

Buddha Venkanna slams YS Jagan and Vijayasai Reddy

  • సీఎం జగన్, విజయసాయిలపై బుద్ధా వ్యంగ్యం
  • తేలు కుట్టిన దొంగలు ఎవరో త్వరలోనే అర్థమవుతుందంటూ వ్యాఖ్యలు
  • 'ఎలుక' గిఫ్టు మీకు చేరలేదా? అంటూ ట్వీట్

తేలు కుట్టిన దొంగలు ఎవరో త్వరలోనే అర్థమవుతుందని, రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోచిన వైఎస్ జగన్ గారూ, ఐటీ రైడ్స్ గురించి మీరు మాట్లాడడం ఈ సంవత్సరానికే అత్యుత్తమ జోక్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ సందర్భంగా బుద్ధా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వ్యంగ్యం ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి గారూ, మీరు ఇచ్చిన సమాచారంతో ఐదు రోజుల పాటు తవ్వి, తవ్వి ఎలుకను పట్టారు. ఆ ఎలుకను మీకు గిఫ్టుగా పంపారట, ఇంకా మీకు చేరలేదా? అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News