Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు

CM Jagan Delhi tour schedule finalized

  • గన్నవరం నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరతారు
  • 3 గంటలకు అక్కడికి చేరుకుంటారు
  • సాయంత్రం 4.10 - 6 గంటల వరకు ప్రధానితో భేటీ

ఏపీ సీఎం జగన్ రేపటి ఒక రోజు ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకోనున్నారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 6 గంటల వరకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీ నుంచి తిరిగి గన్నవరం బయలుదేరతారు. రాత్రి 9.40 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. కాగా, ప్రధాని మోదీతో భేటీలో పాలనా వికేంద్రీకరణ, ఏపీ శాసనమండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News