Rahul Gandhi: అమిత్ షా రాజీనామా చేయాల్సిందే: పార్లమెంటు వద్ద రాహుల్‌ సహా కాంగ్రెస్ ఎంపీల నిరసన

Rahul Gandhi and other Congress MPs protest near Mahatma Gandhi statue at Parliament

  • ఢిల్లీలో జరిగిన హింసపై ఆగ్రహం
  • పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తామంటున్న నేతలు
  • చర్చకు ఒప్పుకోకపోవడంపై ప్రతిపక్షాల మండిపాటు

ఢిల్లీలో జరిగిన హింసపై పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు ఈ రోజు ఉదయం నిరసన తెలిపారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.  

ఎన్డీయేతర పార్టీలన్నీ ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నాయి. పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగకుండా బీజేపీ ప్రయత్నాలు జరుపుతోందని టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరిక్ ఒబ్రెయిన్‌ ఈ రోజు విమర్శలు గుప్పించారు. పార్లమెంటు రెండో దశ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 'ఢిల్లీ హింస'పై చర్చకు ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఈ రోజు పార్లమెంటులో తాను తప్పకుండా ఈ అంశంపై మాట్లాడి తీరుతానని చెప్పారు. 

  • Loading...

More Telugu News