T20 World Cup: ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారు: మహిళల జట్టుపై సౌరవ్ గంగూలీ ప్రశంసలు

Saurav Ganguly praises Womens team for their efforts in T20 world cup

  • టీ20 ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన మహిళల జట్టు
  • ఫైనల్స్ లో ఆసీస్ చేతిలో ఓటమి
  • అద్భుతంగా ఆడారంటూ ప్రశంసించిన గంగూలీ

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సత్తా చాటిన భారత మహిళల జట్టు ఫైనల్స్ లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఒత్తిడిని జయించలేక ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోయి, ఫైనల్స్ లో ఓడిన మహిళల జట్టుకు అందరూ అండగా నిలుస్తున్నారు. చాలా గొప్పగా ఆడారంటూ మద్దతు పలుకుతున్నారు.

మహిళల జట్టుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా ఆడారని, ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారని ఆయన కొనియాడారు. ఈ జట్టును అమితంగా ఇష్టపడుతున్నానని చెప్పారు. మరోవైపు మహిళల జట్టుపై క్రికెట్ దిగ్గజాలు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్ తో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News