Kanna Lakshminarayana: గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి: కన్నా

Kanna demands twenty five lakhs ex gratia for Vizag gas leak victims

  • విశాఖలో విషవాయువు లీక్
  • ఎనిమిది మంది మృతి, వందల మంది ఆసుపత్రుల పాలు
  • మూగజీవాలు సైతం పెద్ద సంఖ్యలో మృత్యువాత
  • మూగజీవాల యజమానులకు కూడా పరిహారం చెల్లించాలన్న కన్నా

విశాఖపట్నంలో జరిగిన విషవాయువు లీక్ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడిన ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. విషవాయు ప్రభావంతో కళ్లు కనిపించక ఓ వ్యక్తి బావిలో పడి మరణించడం అత్యంత దయనీయం. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఈ ప్రమాదంలో మూగజీవాలు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పట్ల లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు. మృత్యువాతపడ్డ మూగజీవాల యజమానులకు నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News