Puducherry: పుదుచ్చేరి మాస్కుల తయారీ కంపెనీలో కరోనా కల్లోలం.. సీఎం ఆగ్రహం!

70 employees of corona company tested positive

  • 70 మంది కార్మికులకు కరోనా
  • కంపెనీ నిర్వాహకులపై కేసు
  • ప్లాంట్ ను సీజ్ చేయాలని ఆదేశాలు

కరోనా రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు మాస్కులను తయారు చేస్తున్న కంపెనీ అది. అలాంటి కంపెనీపై కరోనా పంజా విసిరింది. పుదుచ్చేరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంపెనీలో పని చేస్తున్న 70 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ ఘటనపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ  నిర్వాహకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడ్డారు. ప్లాంట్ ను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు సీఎం ఆదేశాలతో సదరు కంపెనీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News