Genelia: కీలక నిర్ణయం తీసుకున్న జెనీలియా, రితీశ్ దేశ్ ముఖ్!

Genelia and Reteish decides to donate organs

  • అవయవ దానం చేయాలని నిర్ణయించిన జంట
  • ఎప్పటి నుంచో దీనిపై ఆలోచిస్తున్నామన్న జెనీలియా
  • అవయవ దానం చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని విన్నపం

తెలుగు సినీ ప్రేక్షకులను ఎన్నో సినిమాలలో అలరించిన జెనీలియా... బాలీవుడ్ లో సైతం మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాను హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్ ప్రేమలో ఆమె పడిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ లో సెలబ్రిటీ జంటలు ఎన్నాళ్లు కలిసుంటాయో చెప్పలేకపోతున్న ఈరోజుల్లో వీరి జంట మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటూ... ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

తాజాగా జెనీలియా, రితీశ్ జంట ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ, అవయవదానం గురించి తామిద్దరం చాలా కాలంగా ఆలోచిస్తున్నామని తెలిపింది. అయితే అది ఇంత వరకు కుదరలేదని చెప్పింది. డాక్టర్స్ డే సందర్భంగా అవయవాలను దానం చేస్తామనే ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పింది. ఇతరులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడమేనని తెలిపింది. ఇతరుల ప్రాణాలను కాపాడటానికి మీరు కూడా ముందుకు రండని అభిమానులకు పిలుపునిచ్చింది. అవయవ దానం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరింది.

  • Loading...

More Telugu News