Vijay Sai Reddy: చంద్రబాబు మోకాలడ్డాడు అంతే... వేతన సమస్య మూడ్రోజుల్లో సమసిపోతుంది: విజయసాయి

Vijayasi Reddy says Chandrababu causes present salary crisis

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని వేతనాలు
  • ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకున్నారన్న విజయసాయి
  • చంద్రబాబు కక్ష సాధిస్తున్నాడంటూ ఆరోపణలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లును శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకున్న చంద్రబాబు ఉద్యోగులను వేధిస్తున్నాడని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా తన వక్రబుద్ధిని మార్చుకోవడంలేదని, ప్రజలపైన కక్ష సాధిస్తున్నాడని పేర్కొన్నారు. "చంద్రబాబు మోకాలడ్డాడు అంతే. ఈ బిల్లుకు మండలి ఆమోదం అవసరంలేదు. మరో మూడ్రోజుల్లో ఉద్యోగుల వేతనాల సమస్య తొలగిపోతుంది" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News