rama jogaiah: 'నీ ఆవేశాలు చాలు చాలు శివయ్యా' అంటూ.. కరోనా గురించి రామ జోగయ్య శాస్త్రి పాట విడుదల

ramajogaiah song on corona

  • 'హే సీశైలం మల్లయ్యా' అంటూ ప్రారంభమవుతున్న పాట 
  • మా భూగోళం మంచిగ లేదయ్యా అంటూ సాంగ్
  • యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన రామ జోగయ్య శాస్త్రి

మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోన్న కరోనా వైరస్‌ను ఉద్దేశించి సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి ఓ పాట రాసి విడుదల చేశారు. 'హే సీశైలం మల్లయ్యా మా భూగోళం మంచిగ లేదయ్యా.. నీ ఆవేశాలు చాలు చాలు అట్టా శివాలెత్తమాకయ్యా శివయ్యా' అంటూ ఈ పాట కొనసాగుతోంది.

'ఆ మూడో కన్ను అట్నే మూసి ఉంచయ్యా', 'నీవే వీరభద్రుడివైతే అంతే సంగతి' అంటూ సాగుతున్న ఈ పాట ఆసక్తికరంగా ఉంది. 'చల్లబడరా మా అయ్య' అంటూ ఈ పాట ముగుస్తుంది. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాసి, తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్ చేశారు.  
      

  • Loading...

More Telugu News