Maharashtra: భవనం కుప్పకూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

death toll climbs 20 in Bhiwandi building collapse

  • నిన్న తెల్లవారుజామున కుప్పకూలిన భవనం
  • రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
  • రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఉద్ధవ్ ప్రభుత్వం

మహారాష్ట్రలోని భీవండిలో నిన్న తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇప్పటి వరకు 20 మందిని శిథిలాల నుంచి రక్షించాయి. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ట్వీట్ చేయగా, ఇది విచారకరమని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు, బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భవనం శిథిలావస్థకు చేరుకోవడం వల్లే కుప్పకూలినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

  • Loading...

More Telugu News