bhumana karunakar reddy: వైసీపీ ఎమ్మెల్యే భూమనకు మళ్లీ సోకిన కరోనా.. నేడు మరోమారు పరీక్షలు

YCP leader Bhumana karunakar reddy once again tested positive

  • ఆగస్టులో కరోనా బారినపడి కోలుకున్న ఎమ్మెల్యే
  • నిన్న నిర్వహించిన పరీక్షల్లో మరోమారు పాజిటివ్
  • నేటి ఫలితం అనంతరం చికిత్స

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోమారు కరోనా సోకింది. ఆగస్టులో తొలిసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో నిన్న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు.

  • Loading...

More Telugu News