bus stop: వీళ్లు మామూలు దొంగలు కాదు.. బస్టాప్‌ను ఎత్తుకెళ్లారు!

Entire bus stop stolen in Pune Rs 5000 reward announced for anyone who finds it

  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • నిందితులను పట్టిస్తే బహుమతి ఇస్తామన్న ఎన్సీపీ నేత
  • ఇనుప సామాన్లు కొనేవారికి అమ్మేసుకుని ఉంటారంటున్న నెటిజన్లు

సాధారణంగా ఎవరైనా డబ్బు, నగలో, కార్లో, బైకులో ఎత్తుకెళ్తారు. ఇటీవలి కాలంలో బస్సుల దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అయితే, ఈ దొంగలు మాత్రం కొంచెం వెరైటీ. ఏకంగా బస్టాప్‌నే ఎత్తుకెళ్లారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. మహారాష్ట్రలోని పూణెలో జరిగిందీ ఘటన. స్థానికంగా ఉండే ఓ బస్టాప్ అకస్మాత్తుగా మాయం కావడంతో విస్తుపోయిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నగరంలోని దేవకి ప్యాలెస్ ఎదుట పూణె నగర పాలక సంస్థ ఓ బస్టాప్ ఏర్పాటు చేసింది. ఇది కాస్తా చోరీ అయిన విషయం తెలుసుకున్న స్థానిక నేత, ఎన్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ ఆ బస్టాప్ ఫొటోను షేర్ చేస్తూ నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పగటి పూట మాత్రం ఈ దొంగతనం జరగలేదని, ఎవరో దానిని రాత్రిపూట ముక్కలు చేసి పాత ఇనుప సామాన్లు కొనేవారికి అమ్మేసుకుని ఉంటారని అంటున్నారు. గతంలో ఇక్కడ బస్టాప్ ఉన్న మాట వాస్తవమేనని, ఇప్పుడది కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News