Keerti Suresh: 'వేదాళం' రీమేక్ లో చిరంజీవి సోదరిగా బిజీ స్టార్ ఎంపిక!

Artist finalized for Chiranjeevis sister role in Vedalam remake

  • 'ఆచార్య' తర్వాత వేదాళం రీమేక్ లో చిరంజీవి 
  • స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు మెహర్ రమేశ్
  • సోదరి పాత్రకు సాయిపల్లవి, కీర్తి సురేశ్ పేర్ల పరిశీలన
  • చివరికి కీర్తి సురేశ్ కి దక్కిన అవకాశం  

ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' తర్వాత చిరంజీవి రెండు రీమేక్ సినిమాలు చేయనున్నారు. వీటిలో ఒకటి తమిళంలో వచ్చిన హిట్ సినిమా 'వేదాళం' రీమేక్. దీనికి చిరంజీవి కజిన్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో హీరో సోదరి పాత్ర ఒకటి వుంది. ఇది చాలా కీలకమైన పాత్ర కావడంతో దీనికి హోమ్లీ ఇమేజ్ తో పాటు అభినయాన్ని ప్రదర్శించగలిగే కథానాయికను తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో సాయిపల్లవి, కీర్తి సురేశ్ లను పరిశీలించారు. చివరికి కీర్తి సురేశ్ వైపు చిరంజీవి మొగ్గు చూపించడంతో ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె డేట్స్ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారట.

మరోపక్క, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి గుండుతో కనిపిస్తారని అంటున్నారు. అందుకే ఆమధ్య గుండు గెటప్ తో ట్రయిల్ ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఆయన వదిలారు.

  • Loading...

More Telugu News