Narendra Modi: చిలుకలు, పావురాలతో సరదాగా నరేంద్ర మోదీ... ఫొటోలు ఇవిగో!

PM Modi inaugurates an aviary at Kevadia

  • గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ
  • సొంతరాష్ట్రంలో రెండ్రోజుల పర్యటన
  • కెవాడియాలో విహంగ ఆవాస కేంద్రం ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఆయన తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా స్వరాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ కెవాడియాలో ఔషధ మొక్కల పార్కు ఆరోగ్య వన్ ను ప్రారంభించారు. అంతేకాదు, ఓ విహంగ ఆవాస కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం ఆ కేంద్రంలో విహరించారు.

అక్కడ అందమైన పావురాలు, రామచిలుకలను వీక్షిస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. అనేక జాతుల పక్షులను ఆసక్తిగా తిలకించారు. వాటిలో కొన్ని రకాలు చిలుకలు మోదీ చేతిపై వాలాయి. ఈ అనుభూతిని ఆయన చాలా ఆస్వాదించారు. అంతకుముందు ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తూ పంజరంలో ఉన్న పావురాళ్లను బయటికి వదిలారు.

  • Loading...

More Telugu News