Judge Ramakrishna: ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన జడ్జి రామకృష్ణ

Judge Ramakrishna sends legal notices to minister Peddireddy

  • తనను జడ్జి కాదన్నారని మంత్రిపై ఆరోపణలు
  • తన పరువుకు భంగం కలిగించారని వ్యాఖ్య 
  • క్షమాపణలు చెప్పాలని డిమాండ్

చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ, వైసీపీ నేతల మధ్య కొన్నాళ్లుగా వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేశారు.

తనను జడ్జి కాదంటూ మంత్రి వ్యాఖ్యానించారంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టం ముందు దోషిలా నిలబడాలని అన్నారు. ఈ మేరకు ఆయన మంత్రికి లీగల్ నోటీసులు పంపారు. వైసీపీ సర్కారుపై బురద చల్లే ఉద్దేశం తనకులేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News