Surabhi Vanidevi: పీవీ నరసింహారావు కుమార్తెకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్

CM KCR gives MLC chance for Surabhi Vanidevi daughter of late PV Narasimharao

  • తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ అభ్యర్థిగా సురభి వాణీదేవి
  • వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
  • ఎల్లుండితో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ
  • మార్చి 14న పోలింగ్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. కాగా, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతారు. ఆమె రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.

  • Loading...

More Telugu News