Corona Virus: ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రం... వెల్లువలా వస్తున్న కొత్త కేసులు

Corona cases floods in AP as experts warned second wave in country
  • గత 24 గంటల్లో 40,604 కొవిడ్ పరీక్షలు
  • 984 మందికి పాజిటివ్
  • గుంటూరు జిల్లాలో 176 కొత్త కేసులు
  • 306 మందికి కరోనా నయం
  • 4,145కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో ఏపీలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్ అని తేలింది.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 176 మందికి పాజిటివ్ అని నిర్ధారణ కాగా, విశాఖ జిల్లాలో 170, చిత్తూరు జిల్లాలో 163 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 306 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు.

ఏపీలో ఇప్పటివరకు 8,96,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,515 మంది కరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,145 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల మృతి చెందినవారి సంఖ్య 7,203కి పెరిగింది.
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
Active Cases
Second Wave

More Telugu News