Diamonds: భారత మొఘల్ రాజుల వజ్రవైఢూర్యాల కళ్లద్దాలివి.. లండన్ లో వేలం!

Sotheby to Auction Mughal Kings Diamond Spectacles

  • ఈ నెల 27న వేలం వేయనున్న సొతెబి సంస్థ
  • ఒక్కో దాంట్లో 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల పచ్చలు
  • ఒక్కో దానికి రూ.25.8 కోట్లు వస్తాయని అంచనా

అలాంటి ఇలాంటి అద్దాలు కావివి.. భారత్ ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలు. వజ్రవైఢూర్యాలు, పచ్చలు పొదిగి తయారు చేసిన విలాసవంతమైన కళ్లద్దాలు. వీటిని ఈ నెల 27న లండన్ లోని సొతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. ‘ఆర్ట్స్ ఆఫ్ ద ఇస్లామిక్ వరల్డ్ అండ్ ఇండియా’ విభాగంలోని ఆ వస్తువులను జనానికి అమ్మనుంది. వజ్రఖచిత అద్దాలను ‘హాలో ఆఫ్ లైట్’గా, ఎమరాల్డ్స్ పెట్టిన కళ్లద్దాలను ‘గేట్స్ ఆఫ్ పారడైజ్’గా సొతెబీ వేలం సంస్థ పిలుస్తోంది.


దాదాపు 50 ఏళ్ల పాటు ఆ అద్దాలు ఓ ప్రైవేట్ వ్యక్తి వద్దే ఉన్నాయని సంస్థ అంటోంది. 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్ తో ఈ అద్దాలను తయారు చేశారని చెప్పింది. అయితే అవి ఏ యువరాజు చేయించారో.. వాటి రూపశిల్పి ఎవరన్నది మాత్రం తెలియదని సంస్థ పేర్కొంది. కాగా, వేలానికి ముందు ప్రజల సందర్శనార్థం తొలిసారి ఈ నెల 7 నుంచి 11 వరకు హాంకాంగ్ లో ప్రదర్శించింది. నిన్నటి నుంచి లండన్ లో ప్రదర్శిస్తోంది. అక్టోబర్ 26 వరకు ఆ ప్రదర్శన జరగనుంది. మర్నాడే వేలం నిర్వహించనుంది. ఒక్కో దానికి సుమారు రూ.15.5 కోట్ల నుంచి రూ.25.8 కోట్ల దాకా వస్తుందని అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News